IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ దే విజయం

సన్ రైజర్స్, పంజాబ్ జట్లమధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ విజయం సాధించింది. 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు తడబడ్డారు.

IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ దే విజయం

Ipl 2021

IPL 2021 : సన్ రైజర్స్, పంజాబ్ జట్లమధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 125 పరుగులు చేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో రెండో బంతికే సిక్సర్‌ బాదిన హోల్డర్‌(29 బంతుల్లో 47; 5 సిక్సర్లు) పంజాబ్‌ శిబిరంలో టెన్షన్‌ పుట్టించాడు.

Read More : Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

ఆఖరి ఓవర్‌ బౌల్‌ చేసిన నాథన్‌ ఇల్లీస్‌ అద్భుతంగా బౌల్‌ చేసి హోల్డర్‌ను కట్టడి చేయడంతో పంజాబ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/19, 47 నాటౌట్‌) చేసిన హోల్డర్‌ శ్రమ వృధా అయ్యింది. లక్ష ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్‌ 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా 9 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది పాయింట్ల పట్టీలో చివరి స్థానంలో నిలిచింది.