IPL 2021: ఆర్సీబీ జెర్సీ రంగు మారింది.. రెడ్కు బదులు బ్లూ
మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ భారీ అంచనాలతో సిద్ధమైంది. ఫస్టాఫ్ లో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ రోజునే కొవిడ్ పాజిటివ్ అని తెలియడంతో మ్యాచ్..
IPL 2021: మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ భారీ అంచనాలతో సిద్ధమైంది. ఫస్టాఫ్ లో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ రోజునే కొవిడ్ పాజిటివ్ అని తెలియడంతో మ్యాచ్ ను రద్దు చేసి.. ఆ తర్వాత సీజన్ మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఎట్టకేలకు వేదిక మార్చి IPL 2021సెకండాఫ్ ఆడేందుకు రెడీ అయ్యాయి ఫ్రాంచైజీలు.
సీజన్ లో ఆడే తొలి మ్యాచ్ను ఆర్సీబీ రంగు మార్చిన జెర్సీతో మొదలుపెట్టనుంది. ఎర్ర రంగు జెర్సీకి బదులుగా బ్లూ కలర్ జెర్సీలో మైదానంలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 20న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్లో రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కి కృతజ్ఞతగా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగనుంది కోహ్లి సేన.
‘కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందుకు…ఫ్రంట్లైన్ యోధుల పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా గర్వకారణం’ అంటూ ట్వీట్ పోస్టు చేసింది.
కొద్ది సీజన్ల నుంచి ఏదో ఒక మ్యాచ్లో పర్యావరణం పట్ల మద్దతును తెలపడానికి ఆకుపచ్చ జెర్సీని ఆర్సీబీ ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్తో జరిగే మ్యాచ్లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఐపీఎల్ అర్థాంతరంగా వాయిదా పడడంతో ఇప్పుడు ధరించనునన్నారు.
ఫేజ్-1 రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది.