రోహిత్, కోహ్లీ ఔట్, బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి టీమిండియా

రోహిత్, కోహ్లీ ఔట్, బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి టీమిండియా

ఆసీస్‍‌తో వైజాగ్ వేదికగా ఆడుతోన్న తొలి టీ20 ఆరంభంలోనే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బహ్రెండార్ఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా షాట్ కోసం యత్నించిన రోహిత్ .. జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ చేజార్చుకున్న టీమిండియా ఆరంభం నుంచి ఆడుతోన్న దూకుడుగానే ఆడుతోంది. 

రోహిత్ జంపాకు క్యాచ్ ఇస్తే, జంపా బౌలింగ్‌లో కోహ్లీ నైల్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బౌండరీల మీదే ధ్యాస పెట్టిన కోహ్లీ 17 బంతులకు 24పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో రిషబ్ పంత్ వచ్చాడు. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి రాహుల్ (38), పంత్(1)తో క్రీజులో ఉన్నారు. 
 

బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి టీమిండియా:
వైజాగ్ వేదికగా జరుగుతోన్న తొలి టీ20లో భారత్ నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగింది. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది జవాన్లకు సంతాపాన్ని ప్రకటిస్తూ నల్ల రిబ్బన్లు ధరించారు. ఇటీవలే దాడులు సంభవించడంతో అప్రమత్తమైన పోలీసు శాఖ వైజాగ్ స్టేడియానికి బందోబస్తు జాగ్రత్తలు చేపట్టింది.