కెప్టెన్గా కోహ్లీ, ధోనీ రికార్డులను బద్దలుకొట్టిన రోహిత్
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడుతున్న రెండో ఫార్మాట్లో రెండో టీ20లో 7 వికెట్ల ఆధిక్యం దక్కించుకుని విజయంతో ముగించింది టీమిండియా. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటూ సిరీస్కు దూరం కాగా, కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ తీసుకున్నాడు. అయితే ఈ విజయంతో హిట్ మాన్ కెప్టెన్గా 12వ విజయాన్ని అందుకున్నాడు.
టీ20కెరీర్లో 14మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన రోహిత్ శర్మ.. 12 మ్యాచ్లలో విజయాన్ని అందుకున్నాడు. ధోనీ, కోహ్లీలు 14 మ్యాచ్లకు కెప్టెన్లుగా వ్యవహరించి కేవలం 8మ్యాచ్లలోనే విజయాన్ని అందుకోగలిగారు. ఈ లిస్టులో రోహిత్కు సమంగా 12మ్యాచ్ల విజయం అందుకున్న సర్ఫరాజ్ అహ్మద్.. 11 మ్యాచ్లలో గెలిచిన షోయబ్ మాలిక్, అస్గర్ స్టానిక్జై… 10 మ్యాచ్లు గెలుచుకున్న వారిగా గ్రేమ్ స్మిత్, మహేలా జయవర్దనేలు నిలిచారు.
ఈ మ్యాచ్ 16వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రోహిత్.. పాకిస్తాన్ షోయబ్ మాలిక్, న్యూజిలాండ్ మార్టిన్ గఫ్తిల్ల అధిక పరుగుల రికార్డును కూడా అధిమగించేశాడు. శెుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 159పరుగులు చేధించి 7వికెట్ల తేడాతో విజాయన్ని అందుకోగలిగింది. మూడు మ్యాచ్ల టీ20సిరీస్ను ఈ మ్యాచ్తో సమం చేసిన భారత్.. ఆదివారం సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో కివీస్తో తలపడనుంది.