చెన్నైపై ముంబై గెలవడంలో సీక్రెట్ చెప్పిన రోహిత్ శర్మ

చెన్నైపై ముంబై గెలవడంలో సీక్రెట్ చెప్పిన రోహిత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎలా సాధించగలిగాడో సీక్రెట్ చెప్పేశాడు. చిదంబరం స్టేడియం వేదికగా మే7న ముంబై.. చెన్నైలు తలపడ్డాయి. ఇందులోనూ 6వికెట్ల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ విజయం పట్ల ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా మాట్లాడాడు. 

మ్యాచ్ గెలిచి ఐదో సారి ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ అన్ని విధాల సమతూకంతో ఉందట. ‘మేం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాం. ఎలాంటి పరిస్థితులల్లోనైనా పోరాడగల సత్తా ఉంది. బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. చెన్నై వంటి మైదానాల్లో విజయం సాధించగలిగామంటే మైదానాన్ని త్వరగా అర్థం చేసుకోవడమే’ అని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. 

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ముగ్గురు స్పిన్నర్లతో చెపాక్ వేదికగా పోరాడింది. రాహుల్ చాహర్(2 వికెట్లు 14పరుగులు), జయంత్ యాదవ్(1వికెట్ల 25పరుగులు), కృనాల్ పాండ్యా(1వికెట్ల 21పరుగులు)తో చెన్నైను కట్టడి చేశారు. 2010 నుంచి చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై తొలి సారి ఓటమి నమోదు చేసుకుంది.