నా కొడుకు తండ్రిని ఎప్పుడు చూస్తాడో నాకే తెలియదు

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 08:59 AM IST
నా కొడుకు తండ్రిని ఎప్పుడు చూస్తాడో నాకే తెలియదు

అందరిలాగే సానియా మీర్జాకి కూడా పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. పాకిస్తాన్ కోడలు అయిన సానియా మీర్జా పుట్టింటికి వచ్చి హైదరాబాద్ లోనే ఇరుక్కుపోయింది. దీంతో నాలుగు గోడల మధ్యే గడపాల్సి వస్తుందని.. ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తానో అర్థం కావడం లేదని అంటుంది. తానేమో కొడుకు ఇఝాన్ తో కలిసి హైదరాబాద్, ఇండియాలో.. భర్త షోయబ్ మాలిక్ సియాల్‌కోట్, పాకిస్తాన్ లో ఉండిపోయారు. 

రెండేళ్ల విరామం తర్వాత గత జనవరిలో మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన సానియా.. నాన్ స్టాప్ టోర్నమెంట్స్ దిశగా ప్రయాణించాలనుకుంది. కానీ, అమెరికాలో ఉండగా వైరస్ ప్రభావానికి తిరిగి ఇంటికి వచ్చేసింది. లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే. షోబయ్ మాలిక్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలనుకుని పాకిస్తాన్ లో ఉండిపోయాడు. 

‘అలా అతను పాకిస్తాన్ లో నేను ఇక్కడ ఇరుక్కుపోయాం. మాకు చాలా చిన్న పిల్లాడు ఉన్నాడు. వీడితో ఇలా డీల్ చేయడం కష్టంగా ఉంది. నా కొడుకు ఇఝాన్ మళ్లీ తన తండ్రిని ఎప్పుడు కలుస్తాడో మాకే తెలీదు’ అని సానియా మీర్జా ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది. 

మేం ఇద్దరం ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం. 65ఏళ్లకు పైబడిన తల్లి అక్కడ ఉంది. దీంతో అతను అక్కడే ఉండాల్సిన పరిస్థితి. మేం ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడంతే’ అని సానిమా మీర్జా తెలిపారు.