Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్‌ను ‘బావ గారూ..’ అంటున్న భారత్ ఫ్యాన్స్.. సానియా ఫుల్ హ్యాపీ!!

భారత్-పాకిస్తాన్ T20 మ్యాచ్ ఫలితంతో భారత అభిమానులు ఎంతగా నిరాశ చెందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్‌ను ‘బావ గారూ..’ అంటున్న భారత్ ఫ్యాన్స్.. సానియా ఫుల్ హ్యాపీ!!

Sonia

Sania Mirza: భారత్-పాకిస్తాన్ T20 మ్యాచ్ ఫలితంతో భారత అభిమానులు ఎంతగా నిరాశ చెందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాదులతో పోరులో పాకిస్తాన్ కూడా చాలా ఏళ్ల తర్వాత గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ ఈ మ్యాచ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో స్టేడియానికి చేరుకున్న కొంతమంది అభిమానులు షోయబ్ మాలిక్‌ను ‘జిజా జీ జిజా జీ’ అని పిలుస్తూ అందడి చేశారు. ఈ వీడియోను ఆనందపడుతూ సానియా మీర్జా కూడా షేర్ చేసుకుంది.

ఈ వీడియోను సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన తర్వాత.. విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ.. షోయబ్ మాలిక్ 1999 నుంచి పాకిస్తాన్ తరఫున ఆడుతున్నాడని, సానియా, షోయబ్‌లను చూస్తుంటే మాత్రం వయసు పెరుగుతున్నట్లు అనిపించడం లేదన్నారు. బౌండరీలో డైవింగ్ చేస్తూ ఫీల్డింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. షోయబ్ మాలిక్ 1999లో 17 ఏళ్ల వయసులో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

అయితే, భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జాని పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయులు కూడా తమ ప్రేమను షోయబ్ మాలిక్‌పై చూపిస్తూ వస్తున్నారు. షోయబ్ మాలిక్‌ను ‘జిజా జీ జిజా జీ’ అంటూ పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఈ మ్యాచ్ టైమ్‌లో కూడా ‘జిజా జీ జిజా జీ’ అని పిలిచారు. భారత్ అభిమానులు. ‘జిజా జీ జిజా జీ’ అంటే “బావగారూ.. బావగారూ..” అని అర్థం అన్నమాట.

షోయబ్‌ మాలిక్‌‌ను 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. 2018లో కుమారుడికి జన్మనిచ్చింది. ఈ మ్యాచ్ ముందే.. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సానియా నిర్ణయించుకుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ మ్యాచ్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. మ్యాచ్ సమయంలో ట్రోలింగ్ జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది సానియా మిర్జా.