IPL 2021: టాస్ కాయిన్ జేబులో వేసుకున్న శాంసన్.. ఎందుకంటే?
IPL 2021: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ప్రారంభానికి ముందు వేసిన టాస్ సన్నివేశం ఇప్పుడు వైరల్గా మారింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాయల్స్ సారథి సంజూ శాంసన్ టాస్ కోసం రిఫరీ, వ్యాఖ్యాతతో కలసి పిచ్ వద్దకు వచ్చారు. ఈ సమయంలో శాంసన్ టాస్ వేయగానే రాహుల్ టెయిల్స్ కోరుకున్నాడు. టాస్ గెలిచిన సంజూ బౌలింగ్ ఎంచుకోగా.. హెడ్స్ పడిందని చెప్పి రిఫరీ కాయిన్ తీసుకునేలోపు కాయిన్ తీసుకొని తన జేబులో వేసుకున్నాడు సంజూ శాంసన్.
అయితే అప్పుడు అసలు శాంసన్ ఎందుకు టాస్ కాయిన్ తీసుకున్నాడు.. కారణం ఏంటీ? అని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇదే విషయంపై శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సమయంలో స్పందించాడు. ‘ఆ కాయిన్ చూడటానికి చాలా బాగుంది కాబట్టి నేను దాన్ని తీసుకొని జేబులో వేసుకున్నాను. నేను దీన్ని ఉంచుకోవచ్చా అని రిఫరీని అడిగానని కానీ, అలా కుదరదని చెప్పాడు’ అని చెప్పాడు.
కానీ, కారణం ఏంటంటే.. సంజూ శాంసన్ కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ ఇది.. ఈ మ్యాచ్ అతని కెరీర్లో గుర్తుండిపోయేదిలా ఉండాలని అనుకున్నాడు.. ఈ మ్యాచ్లో భారీ సెంచెరీ చెయ్యగా.. ఫస్ట్ కెప్టెన్గా టాస్ వేసిన కాయిన్ను తన దగ్గర భద్రపరచుకోవాలని అనుకున్నాడట.. అందుకే టాస్ కాయిన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
— Cricsphere (@Cricsphere) April 12, 2021