India vs South Africa: రేపు ఫైనల్ టీ20 మ్యాచ్.. కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీని మూడో టీ20 నుంచి తప్పించి విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇవాళ ఉదయమే గువాహటి నుంచి ముంబైకి కోహ్లీ తిరిగి వెళ్లాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ తిరువనంతపురంలో, రెండో టీ20 మ్యాచ్ గువాహటిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా గెలిచింది.

India vs South Africa: రేపు ఫైనల్ టీ20 మ్యాచ్.. కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో మూడో వన్డేలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగి ప్రయోగాలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియాలో ప్రయోగాలు చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది.

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీని మూడో టీ20 నుంచి తప్పించి విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇవాళ ఉదయమే గువాహటి నుంచి ముంబైకి కోహ్లీ తిరిగి వెళ్లాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ తిరువనంతపురంలో, రెండో టీ20 మ్యాచ్ గువాహటిలో జరిగిన విషయం తెలిసిందే.

ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా గెలిచింది. చాలా కాలంగా ఫాం లేక ఇబ్బందులు పడ్డ విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన మ్యాచుల్లో మళ్ళీ పంజుకున్నట్లు కనపడ్డాడు. మూడో టీ20లో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకునే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..