IPL 2023: రోహిత్, కోహ్లి టీ20 క్రికెట్కు దూరమైనట్లే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో యువ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli- Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో యువ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal ) పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సైతం ఫామ్ అందుకున్నాడు. తనదైన శైలిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లను చూస్తుంటే సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టీ20 క్రికెట్కు దూరంకానున్నారు అని అనిపిస్తోందన్నాడు. కోల్కతాతో మ్యాచ్లో యశస్వి జైశ్వాల్ ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకాన్ని అందుకున్న క్రమంలో అతడిని అభినందిస్తూ సబా కరీం చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
Rohit Sharma: హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు
When one sees Jaiswal and SKY bat, it is amply clear that T20 game has moved on from Rohit sharma and Virat Kohli!!@anilkumble1074 @bhogleharsha
— Syed Saba Karim (@SyedSabaKarim5) May 11, 2023
యశస్వి జైశ్వాల్, సూర్యల బ్యాటింగ్ను చూస్తుంటే ఓ విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది. రోహిత్, విరాట్లు పొట్టి క్రికెట్కు దూరం జరిగినట్లుగా అనిపిస్తోందని కరీం అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. హిట్మ్యాన్ ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతుండగా అర్ధశతకాలతో సత్తా చాటుతున్నప్పటికి విరాట్ స్ట్రైక్రేట్ తక్కువగా ఉంది.
Virat Kohli: జైస్వాల్ను ప్రశంసిస్తూ కోహ్లి పోస్ట్.. కాసేపటికే డిలీట్.. అసలు సంగతి ఇదే..?
ఈ సీజన్లో కోహ్లీ 11 మ్యాచుల్లో 133.76 స్ట్రైక్రేట్తో 420 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 11 మ్యాచుల్లో 124.84 స్ట్రైక్రేట్తో 191 పరుగులు చేశాడు. 2024లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలని కరీం సూచించాడు.