T20 World Cup 2021: మెగా ఈవెంట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్న YuppTV

వరల్డ్ లీడింగ్ ప్లాట్ ఫాం అయిన యప్ టీవీ... ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.

T20 World Cup 2021: మెగా ఈవెంట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్న YuppTV

Yupp Tv

T20 World Cup 2021: వరల్డ్ లీడింగ్ ప్లాట్ ఫాం అయిన యప్ టీవీ… ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. సిరీస్ లో ఉన్న 45టీ20 మ్యాచ్ లను 2దేశాల్లో ఆడుతుండగా.. వాటిని 70దేశాల్లో టెలికాస్ట్ చేయనున్నారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వరకూ ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది.

YuppTV ఫౌండర్, సీఈఓ అయిన ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న క్రికెట్.. రీసెంట్ ఈవెంట్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ను ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ టెలికాస్టింగ్ తో క్రికెట్ కు అభిమానులు, ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రాంతాల వారీగా అభిమానులను పెంచుకుంటుంది’ అని స్టార్ టీవీ నెట్ వర్క్ సిండికేషన్ హెడ్ హ్యారీ గ్రిఫ్ఫిత్ వెల్లడించారు.

70దేశాల్లో టీ20 వరల్డ్ కప్ ప్రసారం..
ఈ టీ20 మ్యాచ్ లు దుబాయ్, షార్జా, అబు దాబి, ఒమన్ లలో జరగనున్న మ్యాచ్ లను 70దేశాల్లో ప్రసారం చేయనున్నారు. కాంటినెంటల్ యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా (సింగపూర్, మలేషియా మినహాయించి) అభిమానులు అందరికీ చేరవేస్తున్నారు. ఈ క్రమంలో యప్ టీవీకి మరింతమంది వీక్షకులు పెరుగుతున్నారు.

………………………………….. : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో వరుసగా అక్టోబర్ 18, 20 తేదీల్లో వార్మప్ మ్యాచ్ లు ఆడేయనుంది. అక్టోబర్ 24న పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్ లతో పాటు మరో రెండు క్వాలిఫైయింగ్ జట్లతో ఆడుతుంది.