Team India : ఇంగ్లాండ్‌కు కోహ్లీ, మిథాలీ సేన

ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

Team India : ఇంగ్లాండ్‌కు కోహ్లీ, మిథాలీ సేన

Team India

India VS England : సుదీర్ఘ పర్యటనకు టీమిండియా క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

పురుషుల టీం కెప్టెన్ కోహ్లీ, మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ తో పాటు కేఎల్ రాహుల్, ఝులన్ గోస్వామి. రోహిత్ శర్మలు ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..కూతురు వామికతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కోహ్లీ సేన న్యూజిలాండ్ తో జూన్ 18వ తేదీన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడనుంది. ఇంగ్లాండ్ టీంతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఉమెన్స్ టీమ్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఇంగ్లండ్ టీమ్‌తో తలపడనుంది. ఇంగ్లాండ్‌ వెళ్లిన అనంతరం టీమిండియా క్రికెటర్లు సౌథాంప్టన్‌లో పది రోజులు క్వారంటైన్లో ఉంటారు. మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత జట్టు సభ్యులు కసర్తతులు, సాధన చేస్తారు.

Read More : Mahabubabad: సర్పంచ్ భర్త లైంగిక వేధింపులు..చితక్కొట్టిన మహిళలు