భారత్ – ఇంగ్లండ్ టెస్టు, బీసీసీఐ ఎమోషనల్ వీడియో

భారత్ – ఇంగ్లండ్ టెస్టు, బీసీసీఐ ఎమోషనల్ వీడియో

Team India fans we’ve missed : భారత్ – ఇంగ్లండ్ మధ్య చెన్నైలో రెండు టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే..మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా..రెండో టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రేక్షకుల సందడి కనిపించింది. చాలా రోజుల తర్వాత..తమ అభిమాన క్రికేటర్లను చూడడం సంతోషం వ్యక్తం చేశారు ఆడియన్స్. కేరింతలు, ఈలలతో ముందటి వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా బీసీసీఐ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేసింది.

కరోనా కారణంగా..దాదాపు ఏడాది కాలంగా స్టేడియాలన్నీ ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..స్టేడియాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలను ఆ వీడియోలో చూపెట్టింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. చాలా మంది దీనిని వీక్షించారు. కాస్త సమయంలోనే వైరల్ గా మారిపోయింది. ఏడాది తర్వాత మరలా మ్యాచ్ లు ప్రారంభం కావడం, అదే సమయంలో ప్రేక్షకులను అనుమతినిస్తుండడం ఒక గొప్ప శుభపరిణామమని బీసీసీఐ వెల్లడించింది.