T20 World Cup 2022: ఉత్కంఠపోరులో టీమిండియాపై దక్షిణాఫ్రికా జట్టు విజయం..( ఫొటో గ్యాలరీ)
T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో సఫారీలు విజయం సాధించారు. భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(68) ఒక్కడే రాణించడంతో 20ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. తరువాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేశారు. మార్క్రమ్ 52, మిల్లర్ (59నాటౌట్) రాణించారు.