India – England: టెస్టు షెడ్యూల్ మార్చాలని ఇండియా రిక్వెస్ట్ పంపలేదు – ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. ఇండియా నుంచి మాకెటువంటి అఫీషియల్ రిక్వెస్ట్ రాలేదని చెప్పింది. ఆగష్టు, సెప్టెంబరు నెలల మధ్యలో ఐదు టెస్టుల సిరీస్ జరగాల్సి ...

India – England: టెస్టు షెడ్యూల్ మార్చాలని ఇండియా రిక్వెస్ట్ పంపలేదు – ఇంగ్లాండ్

India England

India – England: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. ఇండియా నుంచి మాకెటువంటి అఫీషియల్ రిక్వెస్ట్ రాలేదని చెప్పింది. ఆగష్టు, సెప్టెంబరు నెలల మధ్యలో ఐదు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా వేసిన ఇండియా సంక్షోభంలో పడిందని, మున్ముందు జరగాల్సిన మ్యాచ్ లు వాయిదా వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా.. ఇంగ్లాండ్ తో జరగాల్సి ఉన్న టెస్టు సిరీస్ పూర్తి చేయాలనే భావిస్తుంది. ఆగష్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకూ ప్రత్యేక విండోలో మ్యాచ్ లు నిర్వహిస్తారు.

రెగ్యూలర్ బేసిస్ పై బీసీసీఐతో మాట్లాడాం. ప్రత్యేకించి కొవిడ్-19 పరిస్థితుల గురించి చర్చించాం. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగే మ్యాచ్ ల షెడ్యూల్ మార్చాలని మాకెటువంటి అధికారిక రిక్వెస్ట్ రాలేదు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి మాట్లాడారు.

సిరీస్ తేదీలు మార్చడం అంటే వేదికలు, అభిమానులతో కూడిన పని.