T20 World Cup: నేడు గ్రూప్-1లో కీలక మ్యాచ్.. శ్రీలంకతో తలపడనున్న ఇంగ్లాండ్.. కంగారులకు షాకిచ్చేనా?

సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టగా.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

T20 World Cup: నేడు గ్రూప్-1లో కీలక మ్యాచ్.. శ్రీలంకతో తలపడనున్న ఇంగ్లాండ్.. కంగారులకు షాకిచ్చేనా?

England vs australia

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ చివరి దశకు చేరింది. సెమీఫైనల్లో బెర్త్ కోసం జట్లు పోటీపడుతున్నాయి. సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టగా.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని పాక్ నటి ప్రకటన..

గ్రూప్-1 దశలో ఐదు జట్లు తలపడ్డాయి. ఇప్పటికే న్యూజీలాండ్ 7 పాయింట్లతో 2.113 నెట్ రన్‌రేట్‌తో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. శ్రీలంక, ఐర్లాండ్, ఆప్గానిస్థాన్ జట్లు సెమీస్ బెర్త్ కు ఇప్పటికే అర్హత కోల్పోయాయి. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. సూపర్-12 దశలో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు ఆడింది. మూడు గెలిచి, ఒక మ్యాచ్ డ్రాకాగా, మరో మ్యాచ్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో (7 పాయింట్లు, -0173 నెట్ రన్‌రేట్) రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రా అయింది. ఇక ఐదో మ్యాచ్ లో శ్రీలంక జట్టుతో నేడు తలపడనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 5 పాయింట్లతో (0.547 రన్ రేట్‌తో) గ్రూప్-1 దశలో మూడో స్థానంలో ఉంది.

T20 World Cup 2022: నిన్నటి మ్యాచులో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’కు పాల్పడ్డాడని ఆరోపణలు.. వీడియో వైరల్

నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీఫైనల్ కు వెళ్లుతుంది. నెట్ రన్ రేట్ ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా ఉండటంతో ఆ అవకాశం ఉంటుంది. అయితే, లంకేయులపై బట్లర్ సేన ఓడిపోతే ఆస్ట్రేలియా నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకెళ్తుంది. దీంతో నేడు జరిగే శ్రీలంక – ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్.. అటు ఇంగ్లాండ్‌కు, అటు ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది.