Tokyo Olympic 2020 : కాంస్య పతకమే టార్గెట్, సింధు మరోపోరు

ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఊహించని విధంగా ఓటమిపాలైన సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకమే టార్గెట్‌గా చైనా ప్లేయర్‌ హి బింగ్‌ జియావోతో తలపడనుంది.

Tokyo Olympic 2020 : కాంస్య పతకమే టార్గెట్, సింధు మరోపోరు

Sindhu

PV Sindhu vs He Bing : ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఊహించని విధంగా ఓటమిపాలైన సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకమే టార్గెట్‌గా చైనా ప్లేయర్‌ హి బింగ్‌ జియావోతో తలపడనుంది. 2021, ఆగస్టు 01వ తేదీ ఆదివారం సాయంత్రం ఇద్దరు స్టార్ ప్లేయర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ గేమ్‌లో గెలిస్తే ఇండియాకు కాంస్య పతకం రానుంది.

Read More : No Mask Rs25,000 Fine : మాస్క్ లేకుంటే రూ.25లు జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య పలు టోర్నమెంట్లలో ఇప్పటి వరకూ 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సింధు 6 మ్యాచ్‌లు గెలవగా.. జియావో 9 మ్యాచ్‌లు గెలిచి సింధుపై ఆధిక్యంలో ఉంది. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఆఖరి ఐదు మ్యాచుల్లో సింధు కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

Read More : Gmail Youtube End : అలర్ట్.. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు

ఇప్పటికే సెమీస్‌లో ఓటమి చవిచూసిన సింధు.. నేడు జరిగే మ్యాచ్‌లో మరింత కసిగా ఆడే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లలో జియావోతో ఉన్న అనుభవాలను ఆధారంగా చేసుకుని.. స్ట్రాటజిక్‌ గేమ్‌ ఆడితే సింధుని కాంస్యం వరించడం ఖాయంగా కనిపిస్తోంది.