Tokyo Olympics 2020: చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు

ఇండియన్ ఉమెన్స్ హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరి సత్తా చాటింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోకుండా దెబ్బతీసింది.

Tokyo Olympics 2020: చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు

New Project (2)

Tokyo Olympics 2020: ఇండియన్ ఉమెన్స్ హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరి సత్తా చాటింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోకుండా దెబ్బతీసింది. ఆస్ట్రేలియాను 1-0 తేడాతో దెబ్బతీసి సెమీస్ కు అర్హత సాధించింది.

క్వార్టర్స్‌కు ముందు జరిగిన పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌లలో భారత్‌ లీగ్‌ దశలో 2 గెలిచి, మూడింటిలో ఓడింది. మొత్తంగా 7 గోల్స్‌ చేసి, 14 గోల్స్‌ సమర్పించుకుంది. మరోవైపు పూల్‌ బీలో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమెరుగకుండా ముగించి టీమిండియాచేతిలో పరాజయం పాలైంది.

ఇటు స్ట్రైకర్లు.. అటు డిఫెన్స్‌ టీం చక్కగా రాణించడంతో భారత్‌ ను గెలుపు వరించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్.. తొలిసారి ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరింది.

ఇక గుర్జీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యేకంగా నిలిచారు. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయకుండానే నిష్క్రమించింది.