Tokyo Olympics 2020 – PV Sindhu: ఢిల్లీలో ఘన స్వాగతం అందుకున్న విన్నర్ పీవీ సింధు

అంతర్జాతీయ స్థాయిలో మరో సారి వరుసగా పతకం అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో కాంస్యాన్ని దక్కించుకున్న సింధు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.

Tokyo Olympics 2020 – PV Sindhu: ఢిల్లీలో ఘన స్వాగతం అందుకున్న విన్నర్ పీవీ సింధు

Pv SIndhu

Tokyo Olympics 2020 – PV Sindhu: అంతర్జాతీయ స్థాయిలో మరో సారి వరుసగా పతకం అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో కాంస్యాన్ని దక్కించుకున్న సింధు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఈ ఫీట్ సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని స్వాగతం పలికారు.

అక్కడ నుంచి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిసేందుకు వెళ్లనున్నారు పీవీ సింధు. ఆగస్టు 15 వేడుకలకు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్‌ బృందం హాజరుకానున్నారు. ఒలింపిక్ క్రీడాకారులను ప్రధాని మోదీ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.