Virat Kohli: దినేశ్ కార్తీక్‌కు వొంగి సెల్యూట్ చేసిన విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఫామ్ కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో కేవలం వికెట్లు పడినప్పుడు మాత్రమే సెలబ్రేషన్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ స్ట్రైకింగ్‌తో దూసుకుపోతున్న దినేశ్ కార్తీక్‌ను చూసి పలు మార్లు..

Virat Kohli: దినేశ్ కార్తీక్‌కు వొంగి సెల్యూట్ చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli First Fifty

 

Virat Kohli: విరాట్ కోహ్లీ ఫామ్ కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో కేవలం వికెట్లు పడినప్పుడు మాత్రమే సెలబ్రేషన్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ స్ట్రైకింగ్‌తో దూసుకుపోతున్న దినేశ్ కార్తీక్‌ను చూసి పలు మార్లు కాంప్లిమెంటరీ విష్ చేశాడు విరాట్. రీసెంట్‌గా ఆదివారం మే8న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ లో దినేశ్ విధ్వంసం సృష్టించాడు.

కేవలం 8డెలివరీల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా ఆడి ఆర్సీబీ ఇన్నింగ్ కు మంచి ముగింపునిచ్చాడు. ఐపీఎల్‌ అరంగ్రేట ప్లేయర్ ఫజల్హఖ్ ఫారూఖీ వేసిన చివరి నాలుగు బంతులకు మూడు సిక్సులు, ఒక ఫోర్ బౌండరీ బాదాడు. దీంతో ఆర్సీబీ 20ఓవర్లకు 192పరుగులు నమోదు చేశాడు.

దినేశ్ కార్తీక్ హీరోయిక్ ప్రదర్శనకు విరాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ ముగించి పెవిలియన్ చేరిన సమయంలో ఒంగి నమస్కరించాడు.

Read Alsoi: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్

ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 193 పరుగులు భారీ లక్ష్యం నిర్దేశించింది.