Virat Kohli: ప్లకార్టు పట్టుకుని కోహ్లీకి షాకిచ్చిన అభిమాని.. ఇంతకీ ప్లకార్డులో ఏముందంటే

తమకు నచ్చిన కొటేషన్లతో ఆటగాళ్లపై ఫ్యాన్స్ ప్లకార్డులతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. అయితే, ఈ ప్లకార్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: ప్లకార్టు పట్టుకుని కోహ్లీకి షాకిచ్చిన అభిమాని.. ఇంతకీ ప్లకార్డులో ఏముందంటే

Virat Kohli: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న అభిమానుల గురించి తెలిసిందే. కోహ్లీ కోసమే మ్యాచ్ చూసే వాళ్లెందరో. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో చాలా మంది అభిమానులు తమ ఆటగాళ్ల గురించి ప్లకార్డులు పట్టుకోవడం మమూలే.

Women’s T20 World Cup: టీ20 మహిళా వరల్డ్ కప్.. రేపే ఇండియా-పాక్ మ్యాచ్… గాయం కారణంగా కీలక ప్లేయర్ దూరం?

తమకు నచ్చిన కొటేషన్లతో ఆటగాళ్లపై ఫ్యాన్స్ ప్లకార్డులతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. అయితే, ఈ ప్లకార్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్లకార్డు ద్వారా అతడు కోహ్లీకి షాకిచ్చాడనే చెప్పాలి. ఆ ప్లకార్డులో ఉన్న అంశమే వైరల్ అయ్యేందుకు కారణం. నాగ్‌పూర్ టెస్ట్ సందర్భంగా కోహ్లీ ఫ్యాన్ పెద్ద ప్లకార్డు పట్టుకుని స్టేడియంలో హల్ చల్ చేశాడు.

Turkey: శిథిలాల కింద 104 గంటలు పోరాడిన మహిళ.. కానీ, చివరకు..

ఆ ప్లకార్డులో ‘నా భార్యకంటే విరాట్ కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తాను’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. దీంతో ఈ అభిమాని ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగానే, ఇన్నింగ్స్ తేడాతో ఇండియా విజయం సాధించింది.