IPL 2021: కోహ్లీ కాస్త లేట్.. ముంబైలో ఢిల్లీ
తొలి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఏదేమైనా ఏప్రిల్ 9 ఆటకు కౌంట్డౌన్...
IPL 2021: మెగా ఫైట్ కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కొన్ని వారాలకుముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేయగా.. అదే బాటలో మిగిలిన జట్లు చేరుతున్నాయి. కాకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ప్రాక్టీస్ కాస్త ఆలస్యంగా రానున్నాడట. ఆ విశేషాలేంటో చూడండి..
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి చెన్నైలో నిర్వహించే క్యాంపులో ఏప్రిల్ 1న చేరనున్నాడు. మంగళవారం నుంచే ఈ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు చెన్నై చేరుకోగా… వన్డే సిరీస్కు ఎంపికైన చాహల్, సిరాజ్ పూణెలో ఆఖరి వన్డే ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. కెప్టెన్ కోహ్లి మాత్రం రెండు రోజుల ఆలస్యంగా టీంలో చేరతాడు.
ముంబై అలా సేఫ్
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఏకం అయ్యారు. సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుతో కలిశారు. వీళ్లంతా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగించుకొని ఆ బబుల్ నుంచి ఐపీఎల్ బబుల్లోకి బదిలీ అయ్యారు. అలా క్వారంటైన్ నిబంధన నుంచి తప్పించుకున్నారు. లేదంటే వారంపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది.
ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, బిల్లింగ్స్, టామ్ కరన్, అక్షర్ పటేల్, క్రిస్ వోక్స్లు సోమవారమే ముంబైలో జట్టుతో కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఫ్రాంచైజీ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం సర్జరీ కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.
మోర్గాన్, శుబ్మన్ గిల్, ప్రసిద్ కృష్ణ కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్లోకి వెళ్లారు. వచ్చే నెల 10న జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్… చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఏదేమైనా ఏప్రిల్ 9 ఆటకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ సీజన్లో కొత్తగా 5 నిబంధనలు ప్రవేశపెట్టారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతుండగా… కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకొని అడుగుపెట్టనుంది.