సెహ్వాగ్ ట్వీట్: బర్త్ డే బంప్స్‌‌తో చంపేశారు

సెహ్వాగ్ ట్వీట్: బర్త్ డే బంప్స్‌‌తో చంపేశారు

ట్రెండ్ మారుతున్న కొద్దీ సెలబ్రేషన్ చేసుకునే పద్ధతి మారిపోతుంది. బర్త్ డే ఈవెంట్లలో కేక్ కటింగ్‌తో పాటు బర్త్ డే బంప్స్ అని ట్రెండ్ తీసుకొచ్చారు. ఇందులో పుట్టిన రోజు వ్యక్తిని కేక్ కట్ చేసేంత సేపు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత కేక్ ముఖాలకు పూసుకుంటారు. ఇదే సెలబ్రేషన్ అంటే..

వీటిని ఎంతమంది వారిస్తున్నా.. వారికి ఇష్టమొచ్చిన స్టైల్‌లో సెలబ్రేషన్ చేసుకోవడానికి యూత్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రాణాలతో పంతం పెట్టుకుని చేసుకుంటున్న సెలబ్రేషన్‌లో ఈ మధ్యన ఓ స్టూడెంట్ చనిపోయాడు. ఆ వ్యక్తిని పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా చితకబాదించుకున్న వీడియో వైరల్‌గా మారింది. అది కాస్తా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడటంతో దానిని పోస్టు చేస్తూ.. ఇలాంటి పుట్టినరోజు సంబరాలు అవసరమా.. అంటూ ట్వీట్ చేశాడు. 

తన అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేసిన వీరూ.. ‘ఇది చాలా బాధాకరం. స్టూడెంట్‍‌ను బర్తడ్ బంప్స్‌తో చనిపోవడానికి కారణమైయ్యారు. ఈ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవద్దు. బాధ్యతాయుతంగా ఉండండి. బర్త్ డే బంప్స్ అలాంటివి పెట్టుకోకండి. ఇదెవరికి సరదాగా అనిపించదు’ అని వీరూ అభిప్రాయపడ్డాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. కొందరు సెహ్వాగ్‌కు మద్దతిస్తుంటే.. మరి కొందరేమో.. నిజంగా చనిపోయాడా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.