WTC Final 2023: మరో రెండు రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్.. టీమ్ఇండియాకు షాక్.. నెట్స్లో గాయపడ్డ కీపర్..!
క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పైనే ఉంది. మరో రెండు రోజుల్లో మ్యాచ్ అనగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
WTC Final 2023-Ishan Kishan: క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పైనే ఉంది. జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ గద కోసం టీమ్ఇండియా(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో మ్యాచ్ అనగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) నెట్స్లో సాధన చేస్తూ గాయపడ్డాడు. నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ మోచేతిని బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. వెంటనే మైదానం నుంచి బయటకు వచ్చేశాడు. తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టలేదు. కొద్ది సమయం తరువాత ఇషాన్ కిషన్ మోచేతికి బ్యాండేజ్తో కనిపించాడు. కాగా.. అతడికి అయిన గాయం తీవ్రత తెలియాల్సి ఉంది.
Yash Dayal: సోషల్ మీడియాలో యశ్ దయాల్ వివాదాస్పద పోస్ట్.. ఆ వెంటనే డిలీట్.. సారీ చెప్పినా..
అతడి గాయం తీవ్రమైనది అయితే అది టీమ్ఇండియాకు షాక్ అని చెప్పవచ్చు. ఐపీఎల్లో మంచి ఫామ్ను కనబరిచాడు కిషన్. కాగా.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ల మధ్య గట్టి పోటీ ఉంది. వీరిద్దరిలో వికెట్ కీపర్గా ఎవరిని తీసుకోవాలా అని మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతోంది. కొందరు ఇషాన్కు మద్దతు ఇస్తుంటే మరికొందరు అభిమానులు కేఎస్ భరత్ను తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ గాయం కారణంగా ఇషాన్ దూరం అయితే భరత్కు తుది జట్టులో చోటు ఖాయం.
కాగా.. ఇప్పటికే టీమ్ఇండియా కీలక ఆటగాళ్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు గాయం కారణంగా దూరం అయిన సంగతి తెలిసిందే.