5G Launch in India : ఢిల్లీలో 5G సర్వీసులను ప్రారంభించిన జియో, ఎయిర్టెల్.. 5G ఫోన్లలో అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
5G Launch in India : భారతదేశంలో 5G సర్వీసులు (5G Services In India) ప్రారంభమయ్యాయి. ఈరోజు (శనివారం) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో దేశీయ రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.
5G Launch in India : భారతదేశంలో 5G సర్వీసులు (5G Services In India) ప్రారంభమయ్యాయి. ఈరోజు (శనివారం) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో దేశీయ రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను ప్రారంభించాయి. 5G సర్వీసులకు సంబంధించి కొన్నింటిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు. ఈ రోజు వినియోగదారులందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వచ్చినట్టు కాదని గుర్తించుకోవాలి.
5G సర్వీసులు మాత్రమే ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ గతంలోనే తెలిపింది. ఈరోజు జరిగిన IMC ఈవెంట్లో, Airtel, Reliance Jio, Qualcomm, అనేక ఇతర కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్లు తమ 5G సర్వీసులను అలాగే వినియోగ కేసులను ప్రదర్శించారు. ఈ 5G వినియోగ కేసులను (5G use cases) ప్రధాని చేత అధికారికంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ జియో ఆకాష్ అంబానీ (Akash Ambani) కూడా హాజరయ్యారు. దాదాపు 20+ కంపెనీలు తమ 5G సర్వీసులను ప్రదర్శిస్తున్నాయి.
ఈ టెక్ కంపెనీలు 5Gని మొబైల్లు, ల్యాప్టాప్లలో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని యాక్సెస్ అందించనున్నాయి. అనేక మంది ఎంటర్ప్రైజ్ యూజర్లకు కూడా 5G సర్వీసులను ప్రదర్శించాయి. ప్రభుత్వానికి ముఖ్యంగా విపత్తు నిర్వహణ, వ్యవసాయం వంటి రంగాలలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని IMCలో ప్రదర్శించాయి.
Jio పెవిలియన్లోని కొందరు మోదీకి Jio ‘True’ 5G సర్వీసులను ప్రదర్శించారు. Jio Glass ద్వారా ఎండ్-టు-ఎండ్ 5G టెక్నికల్ స్వదేశీ అభివృద్ధితో పట్టణ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పంపిణీ మధ్య అంతరాన్ని తగ్గించడానికి 5G ఎలా సహాయపడుతుందో టెక్ కంపెనీలు వివరించాయి. ఈ 5G ప్రారంభోత్సవం సందర్భంగా మోదీతో పాటు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్, దేవుసిన్హ్ చౌహాన్, RIL చైర్మన్ ముఖేష్ అంబానీ, RJIL చైర్మన్ ఆకాష్ అంబానీ ఉన్నారు.
రిలయన్స్ జియో కోల్కతా, ఢిల్లీ, చెన్నై, ముంబైతో సహా 4 నగరాల్లో 5G సర్వీసులను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించాయి. దేశంలోని ఇతర ప్రాంతాలు 2023 చివరి నాటికి 5G సర్వీసులను అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అదే సమయంలో, Airtel కూడా ఈ నెలాఖరులోగా 5G సర్వీసులను ప్రారంభించేందుకు కృషి చేస్తోంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 5G సర్వీసులు వచ్చే ఏడాది చివరి నాటికి మాత్రమే పూర్తవుతుంది. మీ ఫోన్లలో 5G సర్వీసులను పొందడానికి మరికొంత సమయం పడుతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : BSNL 5G Services in India : 2023 ఆగస్టు 15న BSNL 5G లాంచ్.. వచ్చే మార్చి నాటికి 200 నగరాల్లో 5G సర్వీసులు!