Ambassador 2.0: అంబాసిడర్ 2.0.. అంబీగా మార్కెట్లోకి ఎంట్రీ

సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన హిందుస్తాన్‌ మోటార్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ అంబాసిడర్‌ కారు లుక్‌ 'అంబోయ్' తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందూస్థాన్ మోటార్స్ చెన్నై ప్రొడ‌క్ష‌న్ యూనిట్‌లో ఈ నూత‌న అంబీ కారును ఉత్ప‌త్తి చేస్తారు.

Ambassador 2.0: అంబాసిడర్ 2.0.. అంబీగా మార్కెట్లోకి ఎంట్రీ

Mabassador

Ambassador 2.0: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన హిందుస్తాన్‌ మోటార్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ అంబాసిడర్‌ కారు లుక్‌ ‘అంబోయ్’ తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందూస్థాన్ మోటార్స్ చెన్నై ప్రొడ‌క్ష‌న్ యూనిట్‌లో ఈ నూత‌న అంబీ కారును ఉత్ప‌త్తి చేస్తారు.

ఇప్పుడు మళ్లీ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అంబాసిడర్‌ ఎలక్ట్రిక్‌ కారుతో రీ ఎంట్రి అదిరిపోయేలా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హిందుస్తాన్‌ మోటార్స్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ “అప్పట్లో మా ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉండేది. ఇప్పుడు 300కి తగ్గింది.

ఫ్రాన్స్ కార్ల త‌యారీ సంస్థ పౌగోట్, హింద్ మోటార్ ఫైనాన్సియ‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో అంబాసిడ‌ర్ లేదా `అంబీ` మోడ‌ల్ ఇంజిన్‌ను డిజైన్ చేశాయి.

“ప్రస్తుతం ఆర్ధిక సమస్యల నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంబాడిడర్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం చైనీస్ ఈవీ సంస్థల్ని సంప్రదించాం. కానీ యూరోపియన్ కంపెనీలతో జతకట్టాలని నిర్ణయించుకున్నాం. రూ.600కోట్ల పెట్టుబడితో ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో కలిసి అంబాసిడర్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ తయారు చేయబోతున్నట్లు” ఉత్తమ్‌ బోస్‌ వెల్లడించారు.

1954లో స్వ‌దేశీ ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించ‌డానికి నాటి ప్ర‌భుత్వ విధానాలను అనుస‌రిస్తూ త‌యారు చేసిన అంబాసిడర్ స‌ర్కార్ గాడీగా ప్ర‌సిద్ధి చెందింది.