మైక్రోసాఫ్ట్ లేదంటే ట్విట్టర్, ఎవరుకొన్నా, టిక్టాక్ మళ్లీ ఇండియాకు రావడం ఖాయం. మరి దేశీయ యాప్స్ సంగతేంటి?
దేశంలో నిషేధం విధించిన టిక్ టాక్ తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టబోతోందా? ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కొనుగోలు చేయనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. అదేగాని జరిగితే.. దేశీయ యాప్స్ పరిస్థితి ఏంటి? టిక్ టాక్ ప్రభంజనంతో దేశీయ యూజర్లు స్థానిక యాప్స్ ఆదరణ పొందలేదు.. టిక్ టాక్ నిషేధంతో దేశీయ యాప్స్కు ఆదరణ పెరిగే క్రమంలో మళ్లీ టిక్ టాక్ వస్తుందనే ఊహాగానాలతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు విశ్లేషకులు.
టిక్ టాక్ ఇండియాను తిరిగి ప్రవేశపెట్టడానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని విశ్లేషుకులు అంటున్నారు. టిక్ టాక్ ఇండియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుందని.. అలాగే టిక్ టాక్ యూఎస్ను మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ప్రాథమిక చర్చలు జరిపినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టిక్ టాక్ నిషేధంతో స్వదేశీ యాప్స్ కు డిమాండ్ పెరిగిపోయింది.
టిక్ టాక్ స్థానంలో ఉన్న దేశీయ యాప్స్ పై పెట్టుబడిదారులు పెట్టుబడులకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇండియాకు మళ్లీ టిక్ టాక్ వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో పెట్టుబడిదారులంతా తమ పెట్టుబడుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా పరిస్థితులు మారిపోతున్నాయి. షార్ట్ వీడియో షేరింగ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. కానీ టిక్టాక్ క్లోన్కు బదులుగా టిక్టాక్ ద్వారానే మెరుగైన లాభాలను పొందొచ్చునని ఇన్వెంటస్ క్యాపిటల్ పార్ట్నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రుత్విక్ దోషి అన్నారు.
చిన్న యాప్ ప్లాట్ ఫాంల కంటే పెద్ద ప్లాట్ఫారమ్లు అధిక వృద్ధిని సాధించాయి. లాభాలను కూడా అదే స్థాయిలో పొందాయని వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ MX ప్లేయర్ CEO కరణ్ బేడి అన్నారు. కంటెంట్ క్రియేటర్లు ప్రత్యామ్నాయాలను అంచనా వేస్తున్నారు.. సెన్సార్ టవర్ డేటా ప్రకారం.. 650 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో అతిపెద్ద మార్కెట్గా ఉన్న యుఎస్, భారతదేశంలో టిక్టాక్ అధిక వాటా అమ్మకంతో మరిన్ని మార్పులకు కారణమైందని ట్టుబడిదారులు అంటున్నారు. ప్రతి పెట్టుబడిదారుడు రెండు టిక్టాక్ ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూశారు… అందులో మిట్రాన్ టివి, చింగారి యాప్స్.. వారం తరువాత మరో ఐదుగురు ప్లేయర్లు మార్కెట్లోకి వచ్చినట్టు నివేదిక తెలిపింది.
టిక్టాక్ మైక్రోసాఫ్ట్ లేదా ట్విట్టర్ కొనుగోలు చేస్తే.. ముందుగా యుఎస్ మార్కెట్ సమస్యలను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. భారతీయ వినియోగదారులలో మన సామాజిక మూలధనాన్ని నిర్మించడానికి 3-6 నెలల పురోగతిని ఇస్తుందని కోఫౌండర్ సుమిత్ ఘోష్ అన్నారు. షార్ట్ వీడియో-షేరింగ్ యాప్ చింగారి ద్వారా ఈ వారం ప్రారంభంలో 1.3 మిలియన్ డాలర్ల నిధులను సంపాదించింది.
మరో ప్లేయర్ మిట్రాన్ టివి జూలై ఆరంభంలో 5 మిలియన్ డాలర్ల కొత్త నిధులను సేకరించినట్లు చెబుతున్నారు. టిక్ టాక్ ఇతర స్థానిక యాప్స్లతో రాబడి ఇంకా రాలేదు. మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ ప్లేయర్స్ రంగంలోకి దిగిందనే వార్తలు ప్రస్తుత పరిస్థితులకు అనిశ్చితిని కలిగిస్తోంది. కొన్ని టిక్టాక్ క్లోన్లపై పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన పెట్టుబడిదారులను మరింత ప్రభావితం చేస్తుంది.
చింగారి ఘోష్ కూడా టిక్ టాక్ రాకపై తమ యాప్ అవకాశాలను పెద్దగా ప్రభావితం చేయదని అన్నారు. టిక్టాక్ తిరిగి వచ్చినప్పుడు ప్లే స్టోర్లో దాని ర్యాంకింగ్ కోసం కృషి చేయాల్సి ఉంటుందని దోషి అన్నారు. ప్రజలలో చైనీస్ వ్యతిరేక భావన బలంగా ఉందన్నారు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాజమాన్యంలో ఉందని చాలా మందికి ఇప్పటికీ తెలియదని ఆయన గుర్తు చేశారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. జనవరి-మార్చి 2020 నాటికి దాని ఆదాయం సంవత్సరానికి 130% కంటే ఎక్కువ పెరిగి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్బెర్గ్ కంపెనీ గత ఏడాది 3 బిలియన్ డాలర్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. 17 బిలియన్ డాలర్లు.. పరిశ్రమ అంచనాల ప్రకారం.. టిక్టాక్ యజమాని బైట్డాన్స్ ఇండియా ఆదాయం నెలకు 4-5 మిలియన్లు డాలర్లు కావచ్చు. కంటెంట్ క్రియేటర్ల కోసం ఎంపికలు నిషేధం ప్రారంభ రోజుల్లో, క్రియేటర్లు టిక్టాక్ ప్రత్యామ్నాయాలను తీవ్రంగా పరిగణించలేదు. టిక్టాక్ తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
టిక్ టోక్ తిరిగి రావడం ఆశించి తగిన పరిణామమని సూరత్కు చెందిన టాప్ TikToker శివానీ కపిలా అభిప్రాయపడ్డారు. ప్రతి క్రియేటర్ వారి మనస్తత్వం ఆధారంగా ఒక ప్లాట్ ఫాంకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఆమెతో తోటి టిక్టాక్ క్రియేటర్లు చాలా మంది గత కొన్ని వారాలలో ఇతర ప్లాట్ఫామ్లకు మారిపోయారు. ఒక క్రియేటర్ గా టిక్ టాక్ నుంచి మరో ప్లాట్ ఫాంలకు మారిపోయిన వారంతా.. ఇండియాకు తిరిగి టిక్ టాక్ వస్తుందని తెలిసి.. అప్పటివరకూ వేచి ఉండాలని చూస్తున్నారని తెలిపింది.కపిలాకు టిక్టాక్లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 200,000 మంది ఉన్నారు.