Jio True 5G Services : దేశ రాజధానిలో ఫ్రీగా జియో ట్రూ 5G సర్వీసులు.. ఢిల్లీ NCRలో జియోనే ఫస్ట్ 5G నెట్వర్క్.. మీ ఫోన్లో ఇలా 5G యాక్టివేట్ చేసుకోవచ్చు!
Jio True 5G Service : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 5G నెట్వర్క్ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పుడు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, ఇతర ప్రధాన ప్రదేశాలతో సహా ఢిల్లీ-NCR ప్రాంతంలో స్టాండెర్డ్ అలోన్ (SA) 5G నెట్వర్క్ కనెక్టివిటీని అందిస్తోంది.
Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 5G నెట్వర్క్ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పుడు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, ఇతర ప్రధాన ప్రదేశాలతో సహా ఢిల్లీ-NCR ప్రాంతంలో స్టాండెర్డ్ అలోన్ (SA) 5G నెట్వర్క్ కనెక్టివిటీని అందిస్తోంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న జియో యూజర్లు తమ ఫోన్లోని My Jio యాప్లో Jio వెల్కమ్ ఆఫర్కు ఆహ్వానాన్ని పొందవచ్చు.
జియో తమ యూజర్లందరికి అదనపు రుసుము లేకుండా 1Gbps వేగంతో అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అందుకోసం యూజర్లకు స్పెషల్ 5G వెల్ కమ్ ఆఫర్ను కూడా ప్రారంభించింది. జియో యూజర్లు తమ ప్రాంతంలో 5వ జనరేషన్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ప్రస్తుత 4G SIM ఆటోమేటిక్గా 5G నెట్వర్క్కు సపోర్టు అందిస్తుందని Jio ఇప్పటికే దాని యూజర్లకు హామీ ఇచ్చింది.
టెలికాం నుంచి ఆహ్వానం పొందిన తర్వాత యూజర్లు ఈజీగా 5Gకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి, నాథ్ద్వారా, బెంగళూరు, హైదరాబాద్తో సహా 8 భారతీయ నగరాల్లో జియో ఇప్పటికే True 5G పేరుతో 5G సర్వీసులను ప్రారంభించింది. ఇప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ ఇంకా మరో 4 నగరాలకు విస్తరించింది. అందులో గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ నగరాలు ఉన్నాయి. తద్వారా దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఎన్సీఆర్ ప్రాంతాలకు True 5G సర్వీసులను అందించిన మొట్టమొదటి 5G నెట్ వర్క్గా రిలయన్స్ జియో నిలిచింది.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ముఖ్యంగా నివాస ప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ సంస్థలు, పెద్ద వీధుల్లో, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, హై ఫుల్ బాల్ ప్రాంతాలు, టూరిస్ట్ ప్రాంతాలు, హోటళ్లు, టెక్ పార్కులు, రోడ్లు, హైవేలు, మెట్రో ప్రాంతాల్లో జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మీ ప్రాంతంలో Jio 5G అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు 5G రెడీ స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తున్నారు. మీరు ఇప్పటికీ నెట్వర్క్కి కనెక్ట్ చేయవచ్చు. అన్ని మొబైల్ ఫోన్ తయారీదారులు తమ డివైజ్ల కోసం 5G అప్డేట్ను రిలీజ్ చేయలేదు. ముందుగా, మీ 5G ఫోన్ OGM ద్వారా లేటెస్ట్ అప్డేట్ను పొందవచ్చు.
ఒప్పో, వన్ప్లస్, షియోమి, నథింగ్ ఫోన్, శాంసంగ్ ఇప్పటికే జియో 5Gకి సపోర్టు అందించేందుకు OTA అప్డేట్లను ప్రారంభించాయి. ఆపిల్ బీటా యూజర్ల కోసం iOS 16.2ను కూడా రిలీజ్ చేసింది. డిసెంబర్లో iOS 16.2ని రిలీజ్ చేస్తుంది. జియో డిసెంబర్ 2022 నాటికి ముఖ్యమైన భారతీయ నగరాల్లో 5Gని ప్రారంభించినట్టు ప్రకటించింది. 2023 నాటికి పాన్ ఇండియా వ్యాప్తంగా విస్తరించనుంది.
* Settings > Mobile network > లేదా ఇలాంటి ఆప్షన్ పొందవచ్చు.
* ఆ తర్వాత, Jio SIMని ఎంచుకోవచ్చు. ‘Preferred network type‘ ఆప్షన్ ఎంచుకోండి.
* 5G నెట్వర్క్ని ఎంచుకోండి.
* డివైజ్ 5Gకి కనెక్ట్ చేసిన తర్వాత.. మీరు నెట్వర్క్ స్టేటస్ బార్లో 5G సింబల్ చూడవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..