Paytm IPO : పేటీఎం ఐపీవో ఒక్కో షేర్ ధర రూ. 2,150 కేటాయింపు
డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ Paytm తమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది.
Paytm IPO Offer Price : డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ Paytm తమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది. పేటీఎం శుక్రవారం (నవంబర్ 12)న కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఫైనల్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం.. నవంబర్ 18న ఈ కంపెనీ మార్కెట్లో లిస్టు కానుంది. బ్యాంకింగ్, షాపింగ్, మూవీ ట్రావెల్ టికెటింగ్ నుంచి గేమింగ్ వరకు అనేక రకాల సేవలను Paytm అందిస్తోంది. IPO బిడ్డింగ్ స్వీకరణ సమయంలో తన షేర్ల ధరను ఒక్కో షేరుకు రూ. 2,080 నుంచి 2,150 ధరగా నిర్ణయించింది.
షేర్ అత్యధిక ధర ఆధారంగా ప్రైస్ బ్యాండ్ ఎగువన కంపెనీ విలువ రూ. 1.39 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్స్ వచ్చాయి. కంపెనీ యాంకర్-అలాట్మెంట్ 10 రెట్ల కంటే ఎక్కువ ఉన్నందున Paytm ఈ డీల్ను టాప్-ఎండ్లో అంచనా వేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రూ. 18,300 కోట్ల షేర్ విక్రయించనుంది. అధికారికంగా One97 కమ్యూనికేషన్స్ అని పిలిచే కంపెనీ, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద ఫిన్టెక్ IPOగా పేటీఎం అవతరించింది.
మొత్తంమీద, Paytm ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఫిన్టెక్ స్టాక్ అరంగేట్రం అవుతుంది. కంపెనీ పత్రం దాని IPO కోసం లీగల్ పార్టనర్లు, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు (BRLMలు) ఇతర సలహాదారులకు చెల్లించే రుసుము ప్రివ్యూను షేర్ చేస్తుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం.. Paytm BRLMలకు రూ. 323.9 కోట్లు చెల్లిస్తుంది. మొత్తంగా రూ. 18,300 కోట్లలో 1.8 శాతానికి సమానంగా ఉంటుంది. ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద సంచిత BRLM చెల్లింపులలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. Paytm IPO కోసం BRLMలుగా మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాచ్స్, యాక్సిస్ క్యాపిటల్, ICICI సెక్యూరిటీస్, JP మోర్గాన్, సిటీ HDFC బ్యాంక్లను నియమించింది.
శార్దూల్ అమర్చంద్, లాథమ్ & వాట్కిన్స్, ఖైతాన్ & కో, షీర్మాన్ & స్టెర్లింగ్లతో సహా భారత్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లలోని న్యాయ సలహాదారులు కూడా IPOలో వివిధ పోస్టుల్లో పనిచేశారు. Paytm IPO 1.89 రెట్లు సబ్స్క్రిప్షన్తో ముగిసింది. అందుబాటులో ఉన్న 4,83,89,422 షేర్లకు మొత్తం 9,14,09,844 Paytm షేర్లు వేలం వేసింది. Paytm రూ. 10,065 కోట్లతో పోలిస్తే.. రూ. 19,653 కోట్ల విలువైన మొత్తం బిడ్లను దక్కించుకుంది. ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. Paytmలో 28 శాతం హోల్డింగ్ కలిగిన యాంట్ గ్రూప్ 47.04 బిలియన్ల విలువైన షేర్లను 23 శాతం వాటాతో విక్రయిస్తోంది. సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ 16.89 బిలియన్ రూపాయల వాటా విక్రయంతో 2.5 శాతం పాయింట్లు తగ్గి 16 శాతానికి చేరుకుంది.
Read Also : Indian Techie : ఉద్యోగం పోవటంతో..కుటుంబాన్ని హత్యచేసిన టెక్కీకి జీవిత ఖైదు