Paytm : పేటీఎం యూజర్లకు షాక్.. ఇక మొబైల్ రీఛార్జ్ చేస్తే అంతే..!
పేటీఎం యూజర్లకు షాకింగ్ న్యూస్.. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే.. పేటీఎం యాప్ ద్వారా మీ మొబైల్ రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే.
Paytm : పేటీఎం యూజర్లకు షాకింగ్ న్యూస్.. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే.. పేటీఎం యాప్ ద్వారా మీ మొబైల్ రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ విషయంలో పలు నివేదికలు అవుననే చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. రూ. 1 నుంచి రూ. 6 మధ్యలో అదనపు ఛార్జీలు వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి. పేటీఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసినా లేదా యూపీఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఏ విధంగా పేమెంట్ చేసినా సర్ ఛార్జి వసూలు చేయనుంది. రూ.100కి మించి ట్రాన్సాక్షన్లు చేస్తే సర్ ఛార్జీల మోత మోగనుంది.
డిజిటల్ పేమెంట్ మెథడ్ ద్వారా కస్టమర్ల నుంచి ఎలాంటి సౌలభ్యం లేదా లావాదేవీ రుసుము వసూలు చేయదని 2019లో Paytm ట్వీట్ చేసింది. Paytm Cards, UPI, Walletతో కూడిన ఏదైనా పేమెంట్ పద్ధతిని ఉపయోగించి కస్టమర్ల నుంచి ఎలాంటి సౌలభ్యం లేదా లావాదేవీ రుసుమును వసూలు చేయదని ట్విట్టర్లో రాసుకొచ్చింది.
Paytm ఫోన్పే తర్వాత యూజర్లకు రీఛార్జ్ చేసే రెండవ మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫారమ్గా మారింది. గత ఏడాది అక్టోబర్లో, ఫోన్పే రూ. 50 లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్లపై యూజర్లకు ప్రాసెసింగ్ ఫీజుతో ఛార్జీ విధించనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారమ్ ప్రకారం.. చాలా మంది కస్టమర్లు రీఛార్జ్ చేసినప్పుడల్లా ఆ మొత్తాన్ని చూసినట్లు నివేదించారు.
Read Also : Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఎందుకంటే?