Jio True 5G Services : హరిద్వార్లో జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా 226 నగరాల్లో అందుబాటులోకి..!
Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) హరిద్వార్లో హర్ కీ పౌరి నుంచి జియో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించింది.

Relaince Jio True 5G Service Launches in Haridwar, Now Available in 226 Cities
Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) హరిద్వార్లో హర్ కీ పౌరి నుంచి జియో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొత్తం జియో ట్రూ 5G నగరాల సంఖ్య 226కి చేరుకుంది. హరిద్వార్లోని జియో యూజర్లు (Jio Users) అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ వేగంతో అన్లిమిటెడ్ డేటాను పొందేందుకు Jio వెల్కమ్ ఆఫర్కు ఆహ్వానించినట్టు టెలికాం కంపెనీ తెలిపింది.
డెహ్రాడూన్ తర్వాత రాష్ట్రంలో జియో ట్రూ 5G సర్వీసులను పొందుతున్న రెండో నగరంగా హరిద్వార్ అవతరించింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. Jio True 5G వేగంగా జియో ట్రూ 5G టెక్నాలజీ బెనిఫిట్స్ సహా జియో యూజర్లను హరిద్వార్లో ఉన్న ఏకైక 5G సర్వీసులను కంపెనీ తెలిపింది. యూపీలోని డెహ్రాడూన్ సిటీ నుంచి జియో నెట్వర్క్ ద్వారా 5G సర్వీసులను ప్రారంభించినట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

Relaince Jio True 5G Service Launches in Haridwar
హరిద్వార్లో జియో 5Gని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ 5G సర్వీసుతో హరిద్వార్ ప్రజలే కాదు. దేశ విదేశాల నుంచి పవిత్ర హరిద్వార్ను సందర్శించే యాత్రికులు, సమీప భవిష్యత్తులో చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుంచి ఇండో-టిబెట్ సరిహద్దు వైపు ఉత్తరాఖండ్లోని చివరి భారతీయ గ్రామమైన మనా వరకు రాష్ట్రవ్యాప్తంగా జియో 5G నెట్వర్క్ కవరేజీని కలిగి
ఉంది.
కేదార్నాథ్ ధామ్ ట్రెక్ రూట్లో 13,650 మీటర్ల ఎత్తులో హేమకుండ్ సాహిబ్ గురుద్వారా వద్ద ఉన్న అన్ని చార్ ధామ్లలో ఏకైక ఆపరేటర్ జియో పేర్కొంది. చార్ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే.. జియో నెట్వర్క్ ద్వారా 5G సర్వీసులను ప్రారంభించినట్టు తెలిపారు. ఉత్తరాఖండ్లోని అన్ని ప్రధాన పట్టణాలలో త్వరలో జియో 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. హరిద్వార్ ప్రజలకు, ఉత్తరాఖండ్లోని జియో నెట్వర్క్తో సంబంధించిన ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం సింగ్ చెప్పారు.
హరిద్వార్లో జియో ట్రూ 5Gని ప్రారంభించిన సందర్భంగా ఉత్తరాఖండ్ను డిజిటలైజ్ చేయనున్నట్టు జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గంగా సభ, హరిద్వార్ సభ్యులు దేశంలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన హర్ కీ పౌరి నుంచి 5G సర్వీసులను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతి భారతీయుడికి జియో ట్రూ 5G సర్వీసులను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..