Reliance Jio 5G : దేశవ్యాప్తంగా 72 నగరాల్లో రిలయన్స్ జియో 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. మీ సిటీ ఉందేమో చెక్ చేసుకోండి!
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను భారత మార్కెట్లో మొదటిసారిగా అక్టోబర్ 1, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం, దేశంలో 5G నెట్వర్క్ను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్లలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో మాత్రమే ఉన్నాయి.
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను భారత మార్కెట్లో మొదటిసారిగా అక్టోబర్ 1, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం, దేశంలో 5G నెట్వర్క్ను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్లలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో మాత్రమే ఉన్నాయి. 5G నెట్వర్క్ ప్రారంభంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, వారణాసి, చండీగఢ్, ఢిల్లీ వంటి ఎంపిక చేసిన నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాలక్రమేణా, దేశంలోని ఇతర ప్రాంతాలకు సర్వీసులను విస్తరిస్తున్నారు. ఇటీవల, జియో 5G సర్వీసులను గ్వాలియర్, జబల్పూర్, లూథియానా, సిలిగురిలో ప్రకటించింది.
దాంతో పాటు మొత్తం జియో ట్రూ 5G నగరాల సంఖ్య 72కి చేరుకుంది. కంపెనీ మరో నాలుగు నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించనుంది. రిలయన్స్ జియో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. జియో ట్రూ 5G సర్వీసులతో Jio రాబోయే 17వ ఎడిషన్ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా అధునాతన సాంకేతిక సపోర్టును అందించనుంది.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జనవరి 2023లో ఇండోర్లో జరుగుతుంది. ఈ ఈవెంట్కు హాజరయ్యే ప్రతినిధులు ఇప్పుడు Gbps డేటా స్పీడ్, అతి తక్కువ వేగంతో పొందవచ్చు. భారీ నెట్వర్క్ సామర్థ్యం స్వతంత్ర, ప్రపంచ స్థాయి, జియో ట్రూ 5G నెట్వర్క్లో మాత్రమే అందుబాటులో ఉందని జియో ప్రతినిధి తెలిపారు.
Jio 5G సర్వీసు నగరాల లిస్టు మీకోసం..
దేశంలో జియో 5G ముందుగా ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్కతాలో అక్టోబర్ 4, 2022న ప్రారంభమైంది. ఆ తర్వాత నాథద్వారా, చెన్నైలో అక్టోబర్ 22, 2022న జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ నవంబర్ 10, 2022న ప్రారంభమయ్యాయి. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ నగరాల్లో నవంబర్ 11, 2022న జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పూణేలో నవంబర్ 23, 2022న ప్రారంభమయ్యాయి. గుజరాత్ 33 జిల్లాలో నవంబర్ 25, 2022న ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని దేవాలయాలు డిసెంబర్ 14, 2022న లాంచ్ అయ్యాయి.
కొచ్చి, గురువాయూర్ ఆలయంలో డిసెంబర్ 20, 2022న లాంచ్ అయ్యాయి. తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో డిసెంబర్ 26, 2022న ప్రారంభమయ్యాయి. లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్, డేరాబస్సిలో డిసెంబర్ 28, 2022న 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి. భోపాల్, ఇండోర్ నగరాల్లో డిసెంబర్ 29, 2022న లాంచ్ అయ్యాయి. భువనేశ్వర్, కటక్ నగరాల్లో జనవరి 5, 2023న ప్రారంభమయ్యాయి. చివరిగా జబల్పూర్, గ్వాలియర్, లూథియానా, సిలిగురిలో జనవరి 6, 2023న 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..