చౌక బేరం : ఈ స్మార్ట్ టీవీ రూ.5వేలు మాత్రమే

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 06:30 AM IST
చౌక బేరం : ఈ స్మార్ట్ టీవీ రూ.5వేలు మాత్రమే

ఢిల్లీ : ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోతోంది. ప్రతి వస్తువు స్మార్ట్. చేతిలో సెల్ ఫోన్ నుంచి ఇంటిలో టీవీ వరకూ స్మార్ట్..స్మార్ట్. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా దేశంలోని టెలివిజన్ మార్కెట్‌లో స్మార్ట్‌టీవీల హవా నడుస్తోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన మార్కెట్‌పై కన్నేశాయి. 

షామీ ఇన్‌ఫర్మేటిక్స్ అనే కంపెనీ అతి తక్కువ ధరకే స్మార్ట్‌ టీవీలను మార్కెట్‌లో ఆవిష్కరించింది. షామీ ఇనఫర్మేటిక్స్‌ కంపెనీ కేవలం రూ.4వేల 999ల 32 అంగుళాల ఆండ్రాయిడ్‌ LED స్మార్ట్‌ టీవీని ప్రవేశపెట్టింది. 2019, జనవరి 30వ తేదీ బుధవారం ఢిల్లీలో ఈ టీవీ విడుదల అయ్యింది. అందుబాటులో ఉన్న అతిచౌక స్మార్ట్ టీవీ ఇదే అని కంపెనీ ప్రకటించింది.
 

టీవీ స్పెషల్ 

  • 1366×786 రెజల్యూషన్ స్క్రీన్
  • ఐపీఎస్ హెచ్‌డీ పానెల్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్
  • రెండు 10 వాట్స్ స్పీకర్స్
  • హెచ్‌డీఎంఐ పోర్టులు రెండు
  • 2 యూఎస్‌బీ పోర్టులు
  • అన్ని యాప్స్ పనిచేస్తాయి
  • స్మార్ట్ టీవీ రిమోట్ ఉంటుంది
  • వాల్ మౌంట్ యాక్ససిరీస్ కూడా వస్తాయి
  • టీవీ బరువు 6 కేజీలు

     

షామీ మొబైల్ యాప్‌ సాయంతో టీవీలను కొనుగోలు చేయవచ్చు. టీవీ అసలు ధర రూ.4వేల 999. దీనికి పన్నులు, డెలివరీ చార్జీలు కలుపుకుంటే రూ.6వేల నుంచి 7వేల వరకు ఉంటుంది. మార్కెట్‌లో 32 అంగుళాల టీవీ ధర ప్రస్తుతం రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది.