షియోమీ ఫెస్టివల్ సేల్ : Redmi ఫోన్లపై ఎన్ని ఆఫర్లో చూశారా?

ప్రముఖ మొబైల్ మేకర్ కంపెనీ షియోమీ Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2019 సేల్ సందడి మొదలైంది. గురువారం (ఏప్రిల్ 4, 2019) నుంచి రెడ్ మి మోడల్ స్మార్ట్ ఫోన్లపై షియోమీ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 12:13 PM IST
షియోమీ ఫెస్టివల్ సేల్ : Redmi ఫోన్లపై ఎన్ని ఆఫర్లో చూశారా?

ప్రముఖ మొబైల్ మేకర్ కంపెనీ షియోమీ Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2019 సేల్ సందడి మొదలైంది. గురువారం (ఏప్రిల్ 4, 2019) నుంచి రెడ్ మి మోడల్ స్మార్ట్ ఫోన్లపై
షియోమీ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.

ప్రముఖ మొబైల్ మేకర్ కంపెనీ షియోమీ Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2019 సేల్ సందడి మొదలైంది. గురువారం (ఏప్రిల్ 4, 2019) నుంచి రెడ్ మి మోడల్ స్మార్ట్ ఫోన్లపై షియోమీ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. మూడు రోజుల పాటు రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎన్నో ప్రొడక్టులను సొంతం చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, mi.com వెబ్ సైట్లలో RedMi ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా యూజర్లు తమకు నచ్చిన షియోమీ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

షియోమీ ఆఫర్ చేసే స్మార్ట్ ఫోన్లలో పొకొ ఎఫ్1, రెడ్ మి నోట్ 7 ప్రొ, రెడ్ మి నోట్ 6, రెడ్ మి వై2, జియోమీ ప్రొడక్టులైన ఎంఐ పవర్ బ్యాంకులు, ఎంఐ టీవీలు, ఎంఐ స్పీకర్లను ఫెస్టివల్ సేల్లో సొంతం చేసుకోవచ్చు.Xiaomi Mi Fan Festival sale లో HDFC బ్యాంకు కార్డుదారులు రూ.5వేల 998 కొనుగొలుపై ఇన్ స్టంట్ డిస్కౌంట్ 5 శాతంతో రూ.500 వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్ ఈఎంఐ ట్రాన్స్ జెక్షన్లపై కూడా వర్తిస్తుంది. అంతేకాదు.. సేల్ సమయంలో రెడ్ మినోట్ 7 స్మార్ట్ ఫోన్ ను MI Pay నుంచి యూజర్లు కొనుగోలు చేస్తే షియోమీ Mi TVని సొంతం చేసుకోనే అవకాశం ఉంది. 

రెడ్ మి… ధర ఎంత? ఆఫర్లు, డిస్కౌంట్లు ఏంటి?
షియోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రెడ్ మి కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఏ ఫోన్ ధర ఎంత ఉంది? ఎంతకు ఆఫర్ డిస్కౌంట్ అందిస్తుందో ఓసారి లుక్కెద్దాం. 

రెడ్ మి నోట్ 6 ప్రొ : రూ. 5వేలు డిస్కౌంట్ :
రెడ్ మినోట్ 6 ప్రొ స్మార్ట్ ఫోన్ పై రూ.5వేల వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 10వేల 999 ఉంది. అలాగే ఎంఐ ప్రొటెక్ట్ కూడా రూ.799 ధరకే అందుబాటులో ఉంది. 

పొకొ ఎఫ్1 : రూ. 4వేలు డిస్కౌంట్ :
షియోమీ అందించే ప్లాగ్ షిప్ ప్రొడక్టుల్లో 2018 ప్లాగ్ షిప్ షియోమీ పొకొ ఎఫ్1.. రూ.4వేలు డిస్కౌంట్ తో అందిస్తోంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.20వేల 999గా అందుబాటులో ఉంది. అంతేకాదు.. ఎంఐ ఎక్సేంజ్ ఆఫర్ తో కూడా ఈ డివైజ్ సొంతం చేసుకోవచ్చు. 

రెడ్ మి వై2 : రూ. 3వేల 500 డిస్కౌంట్ : 
షియోమీ రెడ్ మి వై2 రిటైల్ డిస్కౌంట్ ధర రూ.7వేల 999తో అందుబాటులో ఉంది. రెడ్ మి వై2 డివైజ్ ఒరిజినల్ ధర రూ. 10వేల 499 ఉండగా.. డిస్కౌంట్ ధర రూ.3వేల 500తో యూజర్లు సొంతం చేసుకోవచ్చు. 

ఎంఐ LED4 ప్రొ : రూ. 9వేలు డిస్కౌంట్ :
ఎంఐ ఎల్ఈడీ టీవీ4 ప్రొ.. 55అంగుళాల స్ర్కీన్.. ఒరిజినల్ ధరపై రూ.9వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ పై ఎంఐ టీవీని డిస్కౌంట్ ధరతో రూ.45వేల 999తో కొనుగోలు చేయొచ్చు. 

రూ.1 ఫ్లాష్ సేల్.. 
షియోమీ అందించే ఎంఐ ఎల్ఈడీ టీవీ4ఎ ప్రొ, రెడ్ మి నోట్ 7 ప్రొ, పొకొ ఎఫ్1, ఎంఐ సౌండ్ బార్ ప్రొడక్టులను కేవలం రూ.1తో కొనుగోలు చేయొచ్చు. ఈ రూ.1 ఫ్లాష్ సేల్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇందులో మిస్టరీయస్ బాక్స్, ఎంఐ ప్యాక్స్, ఎంఐ ఎక్సేంజ్, ఎంఐ గిఫ్ట్ కార్డులు మరెన్నో రూ. 1ఫ్లాష్ సేల్ పై సొంతం చేసుకోవచ్చు.