Ration Rice : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఉచితంగా 15కిలోల బియ్యం

ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్‌ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

Ration Rice : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఉచితంగా 15కిలోల బియ్యం

Ration Rice

ration card ration rice 15kgs rice telangana government : ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్‌ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పలు కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది.

అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటే అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కిలోలు, మునిసిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్‌లో ఒక కిలో చొప్పున కిలో రూ.7కు ఇవ్వాలని ఆదేశించారు.

ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది. మూడు లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. 3,04,253 కుటుంబాలు కొత్తగా రేషన్‌కార్డుకు అర్హులుగా యంత్రాంగం గుర్తించింది. జూలై 26 నుంచి కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించారు. వీరందరికి కూడా ఆగస్టు నుంచి రేషన్‌ బియ్యం అందించనున్నారు.