తెలంగాణలో కొత్త‌గా 1986 కరోనా కేసులు

  • Published By: bheemraj ,Published On : July 31, 2020 / 11:10 PM IST
తెలంగాణలో కొత్త‌గా 1986 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త‌గా 1986 పాజిటివ్ కేసులు న‌మోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 519 మంది మృతి చెందారు.



కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 586 కేసులు, మేడ్చెల్ జిల్లాలో 207, రంగారెడ్డి జిల్లాలో 205, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 123, క‌రీంన‌గ‌ర్‌లో 116, సంగారెడ్డిలో 108, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 61, మెద‌క్‌లో 45, ఖ‌మ్మంలో 41, న‌ల్ల‌గొండలో 36, మంచిర్యాల 35, గ‌ద్వాల 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.



నాగ‌ర్‌క‌ర్నూల్‌ 30, వరంగ‌ల్ రూర‌ల్‌లో 30 , కొత్త‌గూడె 29, ములుగు 27, పెద్ద‌ప‌ల్లి 26, సిరిసిల్ల 23, జ‌న‌గామ 21, సిద్దిపేట 20, నిజామాబాద్‌ 19, వ‌న‌ప‌ర్తి 18, ఆదిలాబాద్ 16, భువ‌న‌గిరి 12 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.