సమ్మర్ స్పెషల్ : సికింద్రాబాద్ కాకినాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ల మధ్య 2 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (రైల్ నెంబర్: 07457) సికింద్రాబాద్ నుంచి మార్చి 22, ఏప్రిల్ 5వ తేదీల్లో రాత్రి 7.30కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది.
తిరుగు ప్రయాణాల్లో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07458) కాకినాడ టౌన్ నుంచి మార్చి 24, ఏప్రిల్ 7వ తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రాబాద్ చేరుతుంది.
Read Also : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక మృతి