తెలంగాణలో 20, 462 కరోనా కేసులు…283 మంది మృతి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1,126 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 9,984 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10, 195 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రంగారెడ్డి 56, మేడ్చల్ 44, వరంగల్ రూరల్ 41, సంగారెడ్డి 20, నల్గొండ 13, మహబూబ్ నగర్ 12, మహబూబాబాద్ 7, కామారెడ్డి 6, సిరిసిల్ల 6, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
సిద్దిపేట 3, నిజమాబాద్ జిల్లాలో 3, మెదక్ 3, ఖమ్మం 2, నిర్మల్ 2, వరంగల్ అర్బన్ 1, కరీంనగర్ 1, గద్వాల 1, వికారాబాద్ 1, నాగర్కర్నూల్ 1, జగిత్యాల 1, ములుగు 1 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.