తెలంగాణలో కొత్తగా రెండు వేల కేసులు

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 09:21 AM IST
తెలంగాణలో కొత్తగా రెండు వేల కేసులు

కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,79,246కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేయగా.. ఒక్కరోజే కరోనాతో 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,070కి చేరుకుంది. కరోనా బారి నుంచి ఒక్క రోజే 2,004 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,48,139కి చేరింది.



ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వారిలో 23,929 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 26,84,215కి చేరింది.