Yadadri : యాదాద్రి దేవాలయానికి విరాళంగా 36.16 కేజీల బంగారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విమాన గోపురం స్వర్ణతాపడం కోసం ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విమాన గోపురం స్వర్ణతాపడం కోసం ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారే కాకుండా ఏపీకి చెందిన వ్యాపారవేత్తలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురానికి బంగారం విరాళంగా అందచేస్తున్నరు. ఇక ఇప్పటివరకు విరాళాల రూపంలో 36.16 కేజీల బంగారం వచ్చింది.
చదవండి : Yadadri Temple : యాదాద్రి వైభవం.. కళ్లు చెదిరే నిర్మాణం… Exclusive Photo Gallery
ఇక స్వామివారి దేవాలయానికి విరాళం ఇచ్చిన వారి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం
సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – 6 కిలోలు
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి – 5 కిలోలు
ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు – 2 కిలోలు
కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నరసింహారెడ్డి – 2 కిలోలు
మంత్రి మల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి – 2 కిలోలు
జలవిహార్ రామరాజు – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి – 1 కిలో
ఎమ్మెల్యే దానం నాగేందర్ – 1 కిలో
మంత్రి హరీశ్రావు – 1 కిలో
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవకొండ దామోదర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్కర్ రావు – 1 కిలోజీయర్ పీఠం – 1 కిలో
చదవండి : Yadadri Temple: యాదాద్రి టెంపుల్ కోసం ఆర్బీఐ నుంచి 125కేజీల బంగారం
ఎమ్మెల్యే బాల్క సుమన్ – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హనుమంతరావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ – 1 కిలో
కడప వ్యాపారవేత్త జయమ్మ – 1 కిలో