తెలంగాణలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 536 కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 536 కేసులు, ముగ్గురు మృతి

536 new corona cases registered in Telangana : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కొత్తగా 622 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,79,135 కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,502 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 7,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 2,70,450 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మరో 5,041 మంది హోంఐసోలేషన్ లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 52,057 శాంపిల్స్ పరీక్షించగా ఇప్పటివరకు 62,57,754 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు 96.88 శాతంగా ఉందని తెలిపింది.