మరో 68మంది CRPF జవాన్లకు కరోనా పాజిటివ్
ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని మరో 68మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా బారినపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 127కు చేరింది. వారిలో 55ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాను ఒకరు మంగళవారం మరణించగా, మరొకరు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మిగతా 125 మందిలో 122 మంది ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ -3 ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుకు చెందిన జవాన్లే కావడం గమనార్హం. మయూర్ విహార్ ఫేజ్ -3 ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో గతంలో 52 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అప్పట్లో 112 మందిని పరీక్షించగా 52 కేసులు వెలుగుచూడటంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు బెటాలియన్ కు సీలు వేశారు. కాగా, కరోనా మహమ్మారి బారినపడిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read | ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 10లక్షల మంది కోలుకున్నారు