corona cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా..కొత్తగా 684 కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... 684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

corona cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా..కొత్తగా 684 కేసులు, ముగ్గురు మృతి

Covid Ts

684 new corona cases in Telangana : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… 684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇటు కరోనాతో ముగ్గురు మరణించారు.

దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 16 వందల 97కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్కరోజులోనే కరోనాతో 354మంది చనిపోయారు.

కేసులు సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించిన మరణాల సంఖ్య పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 50 వేలు దాటింది.