తెలంగాణలో ఒక్కరోజే 872 కరోనా పాజిటివ్‌ కేసులు

  • Published By: bheemraj ,Published On : June 22, 2020 / 08:12 PM IST
తెలంగాణలో ఒక్కరోజే 872 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో సోమవారం (జూన్ 22, 2020) 872 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 713 నమోదయ్యాయి. ఇప్పటి వరకు 8,674 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

కరోనా వైరస్‌ బారిన పడి సోమవారం ఏడుగురు మృతి చెందగా దీంతో మృతుల సంఖ్య 217కు చేరింది. 274 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 4005 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 4452 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 3189 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా, మొత్తం 60,243 టెస్టులు చేసినట్లు పేర్కొంది. 

సోమవారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్‌ రూరల్‌ జిల్లా 6, మంచిర్యాలలో 5, కామారెడ్డి ౩, మెదక్‌ జిల్లాలో ౩, జనగామ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.