తెలంగాణలో ఒక్కరోజే 891 కరోనా కేసులు

  • Published By: bheemraj ,Published On : June 24, 2020 / 06:55 PM IST
తెలంగాణలో ఒక్కరోజే 891 కరోనా కేసులు

తెలంగాణను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం (జూన్ 24, 2020) ఒక్క రోజే 891 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం అన్నారు. 

బుధవారం 4069 శాంపిల్స్ పరీక్షించగా 891 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 10, 444కు చేరుకుంది. కొత్తగా 137 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361 పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 5858 ఉన్నాయి. 

రాష్ట్రంలో కొత్తంగా మరో ఐదు మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 225కి చేరింది.  జీహెచ్ ఎంసీ పరిధిలో 719 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి 86, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. 
 
జీహెచ్ ఎంసీ 719, రంగారెడ్డి 86, మేడ్చల్ 55, భద్రాద్రి కొత్తగూడెం 6, ఖమ్మం 4, 
వరంగల్ అర్బన్ 3, వరంగల్ రూరల్ 3, సంగారెడ్డి 2, కరీంనగర్ 2, నల్గొండ 2, కామారెడ్డి 1, సిద్దిపేట 1, సిరిసిల్ల 1, గద్వాల్ 1, పెద్దపల్లి 1, పెద్దపల్లి, సూర్యపేట 1,  నిజామాబాద్1, మహబూబాబాద్ 1, ఆదిలాబాద్ 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.