Child Died : ఊయలే ఉరితాడయింది..మెడకు తాడు బిగుసుకుని చిన్నారి మృతి
ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊయల తాడే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. కన్నబిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
child died : ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊయల తాడే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..పశ్చిమబెంగాల్ దక్కింసేతంకు చెందిన భక్త బిస్వాస్, పాణేశ్వరి దంపతులు.. బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్కు వచ్చారు. అంకుసాపూర్లో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా ఆస్పత్రి భవనం దగ్గర..భక్త బిస్వాస్ రాడ్బైండర్గా పని చేస్తున్నాడు. వీళ్లు పక్కనే గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు వర్ష బిస్వాస్, పక్కి బిస్వాస్, ఒక బాబు ఉన్నారు.
ఈ నేపథ్యంలో అక్కా చెల్లెళ్లు వర్ష బిస్వాస్, పక్కి బిస్వాస్ ఇద్దరూ నిన్న సాయంత్రం ఆడుకుంటున్నారు. ఉన్నట్లుండి వాళ్లు ఊయల ఊగాలనుకున్నారు. అయితే అక్క కన్నా ముందే ఊయల ఊగాలన్న తాపత్రయంలో చెల్లి పక్కి బిశ్వాస్.. హడావిడిగా కుర్చీ వేసుకుని ఊయల ఎక్కబోయింది. ఈ క్రమంలో ఆసరాగా వేసుకున్న కుర్చీ పట్టుతప్పి కిందపడటంతో ఊయల తాడు చిన్నారి మెడకు బిగుసుకుపోయింది.
Nagarkurnool : కారు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక చిన్నారి మృతి..మూడు రోజులుగా కారులోనే మృతదేహం
దీంతో చెల్లి పక్కి బిశ్వాస్ ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంది. ఇది చూసిన అక్క హర్ష బిస్వాస్ .. చెల్లెను కాపాడాలంటూ గట్టిగా కేకలుపెట్టింది. వర్ష కేకలు విన్న తల్లిదండ్రులు పరుగున వచ్చి చూసే సరికి .. పక్కి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందారు. అయితే కన్నబిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.