రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం : ఆయిల్ మిల్ లో చెలరేగిన మంటలు

  • Published By: bheemraj ,Published On : November 12, 2020 / 06:02 PM IST
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం : ఆయిల్ మిల్ లో చెలరేగిన మంటలు

huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.



కొద్ది రోజులుగా ఎలాంటి యాక్టివిటీ లేకుండా పూర్తిగా మూసివేయబడి ఉంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పూర్తిగా మూసిఉన్న ఆయిల్ కంపెనీ కావడంతో అందులో ఏ రకంగా ప్రమాదం జరిగిందన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.



ఆయిల్ కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. పక్క ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పారిశ్రామికవాడ కావడం పక్కనే మరో ఆయిల్ కంపెనీ ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అక్కడి ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది అలర్ట్ చేశారు. అక్కడ పని చేసే వారందరినీ బయటకు రప్పిస్తున్నారు.



ఈ ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఇది ఆయిల్ కంపెనీ కావడం, ఇంటర్నల్ గా షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.