Janagaon : కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లి ప్రసన్నే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు ప్రసన్న ఒప్పుకుంది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Janagaon : కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

Child

Janagaon : జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లి ప్రసన్నే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు ప్రసన్న ఒప్పుకుంది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే చిన్నారి తల్లి ప్రసన్న ఘటన జరిగిన తర్వాత స్థానికులకు చెప్పిన కథ మరోలా ఉంది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో, ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లి ఓ కట్టు కథ అల్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో రోడ్డుపై వెళ్తుండగా తన మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కునేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని తల్లి ప్రసన్న తెలిపింది. దుండగుడితో ప్రతిఘటించే సమయంలో తన చేతిలో ఉన్న పాపను తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి పరారయ్యాడని చెప్పింది. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ నమ్మారు. స్థానికుల సాయంతో నీటి సంపులో నుంచి పాప తేజస్విని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది.

Girl baby died in drainage : అమావాస్య నాడు పుట్టిన ఆడపిల్ల..బొడ్డుతాడు కూడా కోయని పసిగుడ్డు డ్రైనేజీలో పారేసిన దారుణం

చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో తల్లి ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. పసికందు సంపులో పడిపోయిందని ఆమె ముందుగా స్థానికులకు చెప్పారు. కాసేపటికి మాటమార్చి చైన్ స్నాచింగ్ కు యత్నించిన వ్యక్తి పసికందును సంపులో పడేశాడంటూ చెప్పారు. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. దీంతో తానే చిన్నారిని సంపులో పడేసి చంపినట్లు తల్లి ప్రసన్న పోలీసుల ముందు ఒప్పుకున్నారు.