కార్మికుడిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు

కార్మికుడిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు

A truck crashed into a worker in Kamareddy : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడు.. ఆ దారిలో వెళ్తున్న కంటైనర్ ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయినా డ్రైవర్ ఆపకుండా ట్రక్కును ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో కోపంతో కార్మికుడు డ్రైవర్‌పై దాడికి యత్నించాడు.

డ్రైవర్ ట్రక్కును అంతేవేగంగా ముందుకు పోనివ్వడంతో దానికి తగిలి కిందపడిపోయాడు. ఆ ట్రక్కు వెనక టైరు.. కార్మికుడి కాలుపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని చూసిన చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి కార్మికుడిని పైకి లేపారు. చికిత్స నిమిత్తం కార్మికుడిని హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. గాయపడిన కార్మికుడు వికారాబాద్ జిల్లా బాణాపూర్ గ్రామనికి చెందిన యాదప్పగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.