యాసిడ్‌ దాడికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి

మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మృతి చెందింది. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

యాసిడ్‌ దాడికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి

DEAD

A woman died who was attacked by acid : మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మృతి చెందింది. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. నిన్న అల్లాదుర్గ్‌ మండలం గడిపెద్దాపూర్‌లో మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది. మల్కాపూర్ తండాకు చెందిన 40 ఏళ్ల మహిళ ఆలవత్ చత్రుబాయ్‌పై దుండగులు యాసిడ్ దాడి చేశారు.

జోగిపేట సంతకు వచ్చిన మహిళ నిన్న సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తరువాత ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఆటో డ్రైవర్ ఇంటి ముందు గాయాలతో పడి ఉన్న తక్రిబాయ్‌ను స్థానికులు గమనించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తీవ్రగాయాలు కావడంతో… పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళపై దాడి జరగడం సంచలనం రేపింది.